వల్సాద్: గుజరాత్ జానపద గాయకుడు కీర్తిదన్ గద్విపై మరోసారి అభిమానం పెల్లుబికింది. ఆయన గానామృతానికి మంత్రముగ్ధులైన ప్రేక్షకులు అతడిపై కరెన్సీ నోట్ల వర్షం కురిపించారు. అతనిపై కరెన్సీ నోట్లను పూలలా చల్లుతూ తమ అభిమానం చాటుకున్నారు. శనివారం గుజరాత్ రాష్ట్రంలో వల్సాద్లో జరిగిన కార్యక్రమంలో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
అంతకుముందు అహ్మదాబాద్లో జరిగిన ఓ మ్యూజికల్ ఈవెంట్లో కూడా కీర్తిదన్ పాడిన పాటకు ఫిధా అయిన అభిమానులు అతడిపై లక్షల రూపాయలు వెదజల్లారు. అహ్మదాబాద్లో కంటే ముందు కూడా చాలా చోట్ల ఆయన గాత్రానికి మంత్రముగ్ధులైన ప్రేక్షకులను కరెన్సీ నోట్ల వర్షం కురిపించారు.
#WATCH | People showered money on singer Kirtidan Gadhvi at an event organised in Valsad, Gujarat on 11th March pic.twitter.com/kH4G1KUcHo
— ANI (@ANI) March 12, 2023