ముంబై: కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరను రూ.200 తగ్గించడంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి స్పందించారు. దేశంలో ఎన్నికలప్పుడు మాత్రమే ధరలు తగ్గుతాయని ఫైరయ్యారు. ఎల్లకాలం ధరలను పెంచుకుంటూ పోయి ఎన్నికలప్పుడు మాత్రమే ధరలు తగ్గించడం బీజేపీ సర్కారు విధానమని ఆమె ఎద్దేవా చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఎంతున్న గ్యాస్ ధర ఎంతకు చేరిందని, అందులో ఇప్పుడు ప్రభుత్వం తగ్గించింది ఎంతని మమత ప్రశ్నించారు.
ముంబైలోని బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ ఇంటికి వెళ్లి రాఖీ కట్టిన అనంతరం బయటికి వచ్చిన మమతాబెనర్జిని.. మీడియా ప్రతినిధులు గ్యాస్ ధర తగ్గింపుపై ప్రశ్నించగా ఆమె పైవిధంగా స్పందించారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1న ముంబైలో జరిగే INDIA కూటమి మూడో సమావేశంలో పాల్గొనేందుకు మమతా బెనర్జి ముంబైకి చేరుకున్నారు. ఈ సమావేశంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోనున్నట్లు ప్రతిపక్ష పార్టీల నేతలు చెబుతున్నారు.
#WATCH | Mumbai: On the LPG price cut, West Bengal CM Mamata Banerjee says, “They are decreasing the price during elections…” pic.twitter.com/EmNRLt4fGR
— ANI (@ANI) August 30, 2023