బెంగళూరు: అడవి నుంచి తప్పిపోయి వచ్చిన ఓ గజరాజు జనవాసాల్లోకి ప్రవేశించింది. దారితప్పిన కంగారులో రోడ్లపై పరుగులు పెట్టింది. కర్ణాటక రాష్ట్రం చిక్మంగళూర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. చిక్మంగళూర్లోని ఏబీసీ కాఫీ క్యూరింగ్ ఏరియాలో ప్రవేశించి ఏనుగు హల్చల్ చేసింది. దాంతో భయాందోళనకు గురైన జనం అటవీ అధికారులకు సమాచరం ఇవ్వగా.. వాళ్లు ఘటనా ప్రాంతానికి చేరుకుని గజరాజును అడవిలోకి వెళ్లగొట్టారు. జనావాసాల్లో ఏనుగు పరుగులకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా వీక్షించవచ్చు.
#WATCH | Karnataka: An elephant entered Chikmagalur's ABC Coffee Curing area earlier today. It was sent back to the forest with the help of forest officials. pic.twitter.com/ASySteSgnR
— ANI (@ANI) July 12, 2021