Diwali tradition : దీపావళి ఉత్సవాలు (Diwali celebrations) దాదాపుగా ముగిశాయి. దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో అంగరంగవైభవంగా దీపావళి పండుగ జరుపుకున్నారు. బాణాసంచా (Fire crackers) కాల్చి, దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు. పలు ఆలయాల దగ్గర, నదీ తీరాల్లోని అనేక పుష్కర ఘాట్ల దగ్గర భారీ సంఖ్యలో దీపాలు వెలిగించి దీపోత్సవాలు (Deepotsav’s) నిర్వహించారు. దీపావళి నోములు ఉన్నవాళ్లు నోములు నోచుకున్నారు. పలుచోట్ల ఒకరికొకరు స్వీట్లు పంచుకుని దీపావళి శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
అయితే ఈ పండుగ సందర్భంగా బాణాసంచా కాల్చడం, దీపాలు వెలిగించడం, కొత్తబట్టలు ధరించి నోములు నోచుకోవడం సర్వసాధారణమే అయినా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం కొన్ని ప్రత్యేక ఆచారాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని గ్రామంలోగల భిదద్వాడ్ గ్రామంలో కూడా ఒక ప్రత్యేక అచారం ఉంది. దీపావళి పండుగ మరుసటి రోజు గోవర్దన పూజ పేరుతో ఆ గ్రామానికి చెందిన యువకులు వీధిలో బోర్లా పడుకుని ఆవుల మందతో తొక్కించుకుంటారు. బిదద్వాడ్లో గోవర్ధన పూజ సందర్భంగా ఆ గ్రామ యువకులు ఆవుల మందతో తొక్కించుకున్న దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
#WATCH | Madhya Pradesh: In a unique tradition in the village of Bhidadwad in the Ujjain district, devotees allow cows to walk over them. The tradition is observed on Govardhan Puja, the second day of Diwali. pic.twitter.com/sHFDr2TKNL
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) November 2, 2024