జైపూర్: రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సొంత పార్టీ నేత సచిన్ పైలట్తో మీకు విభేదాలు ఎందుకు అని మీడియా ప్రశ్నించగా.. ‘ఆయన పార్టీలోనే ఉంటే నాతో ఎందుకు కలిసి పని చేయడం లేదు..?’ అని గెహ్లాట్ ఎదురు ప్రశ్నించారు.
గత మూడు పర్యాయాలుగా తాను సీఎంగా ఉంటున్నానని, ఇంకా తనకు పదవుల మీద ఆశ దేనికని, తనకు పదవులు ముఖ్యం కాదని అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యానించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలన్నదే అధిష్ఠానం అభిమతమని, అందుకోసం పని చేయడం తన బాధ్యత అని ఆయన చెప్పారు. ‘నువ్వు ఎదుటి వాళ్లను నమ్మితే ఎదుటి వాళ్లు నిన్ను నమ్ముతారని’ సచిన్ పైలట్ను ఉద్దేశించి గెహ్లాట్ అన్నారు.
‘రాజస్థాన్లో మళ్లీ మన ప్రభుత్వం ఏర్పాటైతే అందరూ కలిసి వస్తారు. పార్టీకి నమ్మకస్తులుగా ఉండేవాళ్లకు ఏదో ఒకరోజు తప్పకుండా అవకాశం వస్తుందని, అప్పటి వరకు సహనంతో వేచి ఉండాలని సోనియాగాంధీ గతంలో చెప్పారు. నువ్వు కూడా నీకు అవకాశం వచ్చేదాక పార్టీకి నమ్మకస్తుడిగా ఉండు’ అని సచిన్ పైలట్కు గెహ్లాట్ సూచించారు. కాగా, విభేదాల కారణంగా గెహ్లాట్, సచిన్ పైలట్ గత కొన్నాళ్లుగా ఒకరికొకరు అంటీముట్టనట్టు ఉంటున్నారు.
You win trust by giving trust. If everyone will walk together then our govt will be repeated. If you will remain loyal to the party then as Sonia Gandhi had said in the Convention that the one who keeps patience gets chance someday: Rajasthan CM Ashok Gehlot pic.twitter.com/BWGxZcVhuW
— ANI (@ANI) May 30, 2023