Goa CM : గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మంగళవారం మధ్యాహ్నం ఉత్తర గోవా జిల్లా బిచోలిమ్ తాలూకాలోని హటుర్లీ గ్రామంలోగల శ్రీ సుసేన్ దత్త మఠాన్ని సందర్శించారు. తన సన్నిహితులతో కలిసి ఆయన ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. ఆశ్రమ నిర్వాహకులు వారికి ఘన స్వాగతం పలికారు.
అనంతరం ప్రమోద్ సావంత్ ఆయన సన్నిహితులు ఆశ్రమంలోని బ్రహ్మేశానంద స్వామీజీని కలిశారు. ఆయన నమస్కరించి.. ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం ఆయనతో కాసేపు ముచ్చటించారు. అందుకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు..
#WATCH | Goa CM Pramod Sawant visited and offered prayers at Shree Sushen Datta Muth in Aturli today. pic.twitter.com/AOtbgtyg9k
— ANI (@ANI) March 26, 2024