న్యూఢిల్లీ: పంజాబీ సింగర్ సిధూ మూసేవాలా (Sidhu Moosewala) హత్య కేసులో అరెస్టయ్యి జైల్లో ఉన్న పంజాబ్ గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) ని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) అధికారులు ఇవాళ ఢిల్లీలోని పటియాలా హౌస్కోర్టులో హాజరుపర్చారు. ఈ నెల 1న బిష్ణోయ్ గ్యాంగ్ ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే శివసేన పార్టీకి చెందిన ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) కు చంపేస్తామంటూ బెదిరింపు మెసేజ్ పంపింది. దాంతో ముంబైలోని కంజూర్ మార్గ్ పోలీస్స్టేషన్లో బిష్ణోయ్పై కేసు నమోదైంది.
సిధూ మూసేవాలాను హతమార్చినట్టే తనను కూడా హతమారుస్తామని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తనకు బెదిరింపు మెసేజ్లు పంపిందంటూ సంజయ్ రౌత్ పోలీసులకు రాతపూర్వక ఫిర్యాదు చేశారు. ఈ కేసులో విచారణ కోసం జైల్లో ఉన్న బిష్ణోయ్ని NIA అధికారులు ఇవాళ పటియాలా హౌజ్ కోర్టుకు తీసుకొచ్చారు. బిష్ణోయ్ గ్యాంగ్ సంజయ్ రౌత్కేగాక బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఆఫీస్కు కూడా చంపుతామని బెదిరింపు కాల్స్ చేసింది. దాంతో ఖాన్కు భద్రతను పెంచారు. ఇదిలావుంటే యూపీ గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్లను హతమార్చిన సన్నీసింగ్ గ్యాంగ్ లారెన్స్ బిష్ణోయ్ ద్వారా స్ఫూర్తి పొందినట్లు విచారణలో వెల్లడించింది.
#WATCH | Gangster Lawrence Bishnoi brought to Delhi’s Patiala House Court. pic.twitter.com/2KYrJuxU9T
— ANI (@ANI) April 18, 2023