న్యూఢిల్లీ: హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఇజ్రాయెల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ అజయ్ విజయవంతంగా కొనసాగుతున్నది. తాజాగా నాలుగో విమానం ఇజ్రాయెల్ నుంచి ఢిల్లీకి చేరుకుంది. ఆ విమానంలో 274 మంది భారతీయులు స్వదేశానికి వచ్చారు.
పాలస్తీనాలోని హమాస్ మిలిటెంట్ గ్రూప్ ఇటీవల ఇజ్రాయెల్పై మెరుపుదాడికి పాల్పడింది. ఒకేసారి 5 వేల రాకెట్లను ప్రయోగించింది. ఈ దాడివల్ల ఇజ్రాయెల్లో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించి ప్రతిదాడులకు దిగింది. ఈ యుద్ధం రెండువైపులా వేల మందిని బలిగొంటున్నది.
#WATCH | Fourth flight under Operation Ajay, carrying 274 Indian nationals reaches Delhi Airport from Israel. pic.twitter.com/q7c9c5rvG9
— ANI (@ANI) October 15, 2023