Bilkis Bano: బిల్కిస్ బానో అత్యాచారం కేసులో విడుదలైన 11 మంది దోషులను తిరిగి జైల్లో పెట్టాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. దేశ సర్వోన్నత న్యాయస్థానం సరైన తీర్పు ఇచ్చిందని పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో గుజరాత్ రాష్ట్రం దేవ్గఢ్ బారియా ఏరియాలోని బిల్కిస్ బానో ఇంటి ముందు పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.
కాగా బిల్కిస్ బానో అత్యాచార కేసులో సుప్రీంకోర్టు సోమవారం ఉదయం సంచలన తీర్పు వెలువరించింది. ఆ కేసులో దోషులుగా ఉన్న 11 మందికి గుజరాత్ సర్కారు క్షమాభిక్ష పెట్టడాన్ని, దోషులను విడుదల చేయాలని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. దోషులకు క్షమాభిక్ష పట్టే అధికారం గుజరాత్ సర్కారుకు లేదని తీర్పులో స్పష్టంచేసింది.
కేసు దర్యాప్తు పూర్తిగా మహారాష్ట్రలో జరిగినందున క్షమాభిక్ష పెట్టే అధికారం కూడా మహారాష్ట్ర సర్కారుకే ఉందని సర్వోన్నత న్యాయస్థానం వివరించింది. దోషులకు గుజరాత్ ప్రభుత్వం పెట్టిన క్షమాభిక్షను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. వారు చట్ట ప్రకారం క్షమాభిక్ష పొందాలంటే రెండు వారాల్లో తిరిగి జైలుకు వెళ్లాల్సిందేనని ఆదేశించింది. జస్టిస్ బీవీ నాగర్నత, ఉజ్జల్ భూయాన్లతో కూడిన ధర్మాసనం ఇవాళ ఈ కేసులో తీర్పు వెలువరించింది.
బిల్కిస్ బానో అత్యాచారం కేసులో దోషులుగా ఉన్న 11 మందికి గుజరాత్ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టడంతో ఆ రాష్ట్ర హైకోర్టు వారి విడుదలకు ఆదేశించింది. దాంతో సత్ప్రవర్తన కింద 2022 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆ 11 మందిని జైలు నుంచి విడుదల చేశారు. అయితే దోషుల విడుదలను సవాల్ చేస్తూ బిల్కిస్ బానో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆమె పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీం తాజా తీర్పును వెలువరించింది.
#WATCH | Firecrackers being burst outside the residence of Bilkis Bano in Devgadh Baria, Gujarat.
Supreme Court today quashed the Gujarat government’s decision to grant remission to 11 convicts in the case of gangrape of Bilkis Bano. SC directed 11 convicts in Bilkis Bano case… pic.twitter.com/T7oxElwgcY
— ANI (@ANI) January 8, 2024