Fire accident: స్టేషన్లో ఆగి ఉన్న రైలు బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. నాలుగు ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పేశారు. మహారాష్ట్రలోని పుణె రైల్వే జంక్షన్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
పుణెకు చెందిన రైల్వే విభాగం ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించింది. ఈ మేరకు రైలు బోగీలో మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలను విడుదల చేసింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని తెలిపింది.
#WATCH | Pune, Maharashtra: Fire breaks out at a coach of a train stationed at Pune Railway Junction yard. Four fire tenders reached the spot. The fire was brought under control
(Video: Pune Fire Department) pic.twitter.com/Kzw8wMhaXY
— ANI (@ANI) February 13, 2024