అహ్మదాబాద్: టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన భవీనా పటేల్ ( Celebrations ) స్వస్థలమైన మెహసానా పట్టణంలో సంబురాలు అంబరాన్నంటాయి. కుటుంబసభ్యులు, స్నేహితులు, ఇరుగుపొరుగు అంతా కలిసి భవీనా విజయం సాధించిన ఘడియలు పండుగలా జరుపుకున్నారు. ఒకరికొకరు స్వీట్లు పంచుకున్నారు. పటాకులు కాల్చారు. అనంతరం గుజరాతీ సంప్రదాయ నృత్యమైన గార్బా డ్యాన్స్తో అలరించారు. భవీనా తల్లిదండ్రులతోపాటు, స్నేహితులు, ఊరివాళ్లు అంతా కలిసి నృత్యం చేశారు.
ఈ సందర్భంగా భవీనా తండ్రి హస్ముఖ్భాయ్ పటేల్ మాట్లాడుతూ.. తమ కూతురు తామంతా గర్వపడేలా చేసిందన్నారు. ఆమె స్వదేశానికి రాగానే మెహసానాలోకి ఘనంగా స్వాగతం పలుకుతామన్నారు.