Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి (Delhi CM) అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) దంపతులు కన్నాట్ప్లేస్లోని హనుమాన్ మందిర్ (Hanuman Mandir) లో ప్రత్యేక పూజలు చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు (Delhil liquor case) లో అరెస్టయ్యి తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ సుప్రీంకోర్టు (Supreme Court) బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం సాయంత్రం విడుదలయ్యారు. శనివారం ఉదయం తన భార్య సునీత కేజ్రీవాల్ (Sunita Kejriwal) తో కలిసి హనుమాన్ మందిర్కు వెళ్లారు.
ఈ సందర్భంగా కేజ్రీవాల్ దంపతుల వెంట ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్తోపాటు పలువురు ఆప్ నేతలు ఉన్నారు. వారంతా కలిసి హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేశారు. కాగా ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముందుగా కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసింది. ఈడీ దర్యాప్తు పూర్తయ్యే సమయంలో అదే కేసులో సీబీఐ అరెస్ట్ చేసింది. దాంతో ఆయన మరికొన్ని నెలలు జైల్లో ఉండాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఆరు నెలల తర్వాత శుక్రవారం ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.
#WATCH | Delhi CM Arvind Kejriwal along with his wife Sunita Kejriwal, former Deputy CM Manish Sisodia and AAP MP Sanjay Singh offer prayers at Hanuman Mandir in Connaught Place.
Arvind Kejriwal was released from Tihar jail yesterday after the Supreme Court granted him bail in… pic.twitter.com/aZbB9L6XYi
— ANI (@ANI) September 14, 2024