Karti Chidambaram : లోక్సభ తొలి విడత ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నెల 27 తొలి విడత లోక్సభ ఎన్నికల నామినేషన్ గడువు ముగియనుంది. దాంతో నామినేషన్లు జోరందుకున్నాయి. తాజాగా తమిళనాడులోని శివమొగ్గ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబంర నామినేషన్ వేశారు.
సోమవారం మధ్యాహ్నం తన అనుచరులతో కలిసి వచ్చి కార్తి చిదంబరం రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. కాగా, లోక్సభ తొలి విడత ఎన్నికల నామినేషన్ల దాఖలుకు ఇతర రాష్ట్రాల్లో గడువు ఈ నెల 27తో ముగియనున్నా.. బీహార్లో మాత్రం ఈ నెల 28న ముగియనుంది. ఇక లోక్సభ తొలి విడత ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది.