Vishnu Deo Sai: ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి (Chhattisgarh CM) విష్ణుదేవ్ సాయ్ (Vishnu Deo Sai) భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం తన కుమారుడు, అనుచరులతో కలిసి భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి వెళ్లిన ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
గోదావరి నదిలో పుణ్యస్నానం ఆచరించి, కాషాయ వస్త్రం కప్పుకుని ఆలయంలో లోపలికి వెళ్లిన విష్ణుదేవ్ సాయ్ సీతారామచంద్రస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఛత్తీస్గఢ్ సీఎంకు మంత్రోచ్ఛరణలతో ఆశీర్వచనాలు అందజేశారు.
ఛత్తీస్గఢ్ సీఎం భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా వీక్షించవచ్చు.
#WATCH | Bhadradri Kothagudem, Telangana: Chhattisgarh CM Vishnu Deo Sai offers prayers at Sri Sita Ramchandra Swami Temple. pic.twitter.com/RkKHt5DEeq
— ANI (@ANI) February 25, 2024