Mayavati : తమిళనాడు బీఎస్పీ చీఫ్ కె ఆర్మ్స్ట్రాంగ్ (K Armstrong) కు ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి (Mayawati ) నివాళులు అర్పించారు. ఆదివారం ఉదయం బీఎస్పీ జాతీయ సమన్వయకర్త ఆకాశ్ ఆనంద్ (Akash Anand) తో కలిసి తమిళనాడు రాజధాని చెన్నైకి చేరుకున్న మాయావతి.. అక్కడి నేరుగా ఆర్మ్స్ట్రాంగ్ నివాసానికి చేరుకున్నారు.
అక్కడ ఆర్మ్స్ట్రాంగ్ భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి మాయావతి నివాళులు అర్పించారు. ఆయన భార్యను, కుటుంబసభ్యులను కలిసి మాట్లాడారు. వారికి తాను అండగా ఉంటానని ధైర్యం చెప్పి ఓదార్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఆర్మ్స్ట్రాంగ్ హత్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల అంశాన్ని స్టాలిన్ సర్కారు సీరియస్గా తీసుకోవాలని సూచించారు.
#WATCH | Chennai, Tamil Nadu: BSP Chief Mayawati and party’s National Coordinator, Akash Anand pay their last respects to Tamil Nadu BSP President K Armstrong.
K Armstrong was hacked to death by a group of men near his residence in Perambur on 5 July. pic.twitter.com/4kQImXFYX9
— ANI (@ANI) July 7, 2024
ప్రభుత్వం సీరియస్గా ఉంటేనే నేరస్తులు అరెస్టవుతారని మాయావతి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను ప్రభుత్వం కాపాడితేనే ప్రజలు తాము సురక్షితంగా ఉన్నామనే ధైర్యంతో ఉంటారని ఆమె అభిప్రాయపడ్డారు. కాగా, బీఎస్పీ తమిళనాడు అధ్యక్షుడు ఆర్మ్ స్ట్రాంగ్ శుక్రవారం రాత్రి పెరంబూరులోని తన ఇంటికి సమీపంలో హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు బైకులపై వచ్చి ఆయనను హత్య చేశారు.