Assam CM : లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అసోంలో బీజేపీ అభ్యర్థుల తరుఫున ప్రచారం చేస్తున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ.. అడగడునా డ్యాన్స్ చేస్తూ కార్యకర్తలకు బోర్ కొట్టిస్తున్నారు. తొలుత శివసాగర్ లోక్సభ స్థానంలో ఏర్పాటు చేసిన బీజేపీ ప్రచార సభలో తొలిసారి బిశ్వశర్మ డ్యాన్స్ చేశారు. బీజేపీ ఎన్నికల ప్రచారం కోసం రాయించుకున్న ‘ఆకౌ ఏక్బార్.. మోదీ సర్కార్’ అంటూ అస్సామీ భాషలో సాగే పాటకు ఆయన స్టెప్పులేశారు.
ఆ పాటకు కార్యకర్తల నుంచి మంచి రెస్సాన్స్ వచ్చింది. సీఎం స్టేజీపై డ్యాన్స్ చేస్తుంటే కార్యకర్తలు స్టేజీ ఎదురుగా చప్పట్లు కొడుతూ నృత్యాలు చేశారు. అప్పటి నుంచి ప్రతి రోజు ఆయన ఏ ప్రచార సభకు వెళ్లినా డ్యాన్స్ చేస్తున్నారు. స్టేజీపై ‘ఆకౌ ఏక్బార్.. మోదీ సర్కార్’ అనే పాట ప్లే కావడం, హిమాంత డ్యాన్స్ చేయడం రొటీన్గా మారిపోయింది.
ఇవాళ లఖింపూర్ జిల్లాలో ఏర్పాటు చేసిన బీజేపీ ప్రచార సభలో కూడా హిమాంత బిశ్వశర్మ డ్యాన్స్ చేశారు. కానీ కార్యకర్తల నుంచి అంతగా స్పందన లభించలేదు. స్టేజీకి దగ్గరగా ఉన్న కొందరు తప్ప ఎవరూ అంతగా రెస్పాండ్ కాలేదు. వారం రోజులుగా ప్రతి సభలో సీఎం డ్యాన్స్ చేస్తుండటం, టీవీల్లో ఆ వీడియోలను మళ్లీమళ్లీ చూపిస్తుండటంతో కార్యకర్తలు బోర్ ఫీలవుతున్నట్లు తెలుస్తోంది.
#WATCH | Lok Sabha elections 2024 | Assam Chief Minister Himanta Biswa Sarma dances during his election campaign rally in Lakhimpur district to support the BJP candidate for Lakhimpur parliamentary constituency Pradan Baruah.
(Video: Himanta Biswa Sarma’s social media) pic.twitter.com/jYUfZ1CtgW
— ANI (@ANI) April 12, 2024