Army greets people: భారత ఆర్మీ బృందం ఒకటి దేశ ప్రజలకు వినూత్నంగా న్యూఇయర్ విషెష్ చెప్పింది. ఎనిమిది మంది సైనికులతో కూడిన ఓ బృందం భారీ జాతీయ పతాకాన్ని తీసుకుని నియంత్రణ రేఖ సమీపంలోని ఎత్తయిన మంచు శిఖరాన్ని అధిరోహించింది. ఆ శిఖరంపై జాతీయ పతాకాన్ని గుచ్చి.. ఎనిమిది మంది సైనికులు మోకాళ్లపై కూర్చుని దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. జమ్ముకశ్మీర్ రాష్ట్రం కుప్వారా జిల్లాలో ఈ వినూత్న దృశ్యం ఆవిష్కృతమైంది. ఆ దృశ్యాన్ని కింది వీడియోలో మీరు కూడా వీక్షించండి.