లక్నో: స్టార్ హీరో రజినీకాంత్ మంగళవారం సాయంత్రం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ను కలిశారు. లక్నోలోని యూపీ సీఎం అధికారిక నివాసంలో వీరి భేటీ జరిగింది. అయితే, కేవలం మర్యాదపూర్వకంగా మాత్రమే వీరు కలిసినట్లు తెలుస్తున్నది. ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రయోజనం లేదని సమాచారం. కాగా, యోగీ ఆదిత్యనాథ్ను కలిసిన సమయంలో రజినీ వెంట ఆయన సతీమణి కూడా ఉన్నారు.
యోగీ ఆదిత్యనాథ్ అధికారిక నివాసానికి వచ్చిన రజినీకాంత్కు ఘన స్వాగతం లభించింది. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర రజినీకి యోగీ అదిత్యనాథ్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం లోపలికి తీసుకెళ్లి ఆయనకు ఒక ఆధ్యాత్మిక పుస్తకాన్ని, జ్ఞాపికను బహూకరించారు. ఆ తర్వాత రజినీ దంపతులతో కలిసి ఫొటో దిగారు. తర్వాత రజినీ, యోగీలు కొంతసేపు మాట్లాడుకున్నారు.
#WATCH | Actor Rajinikanth meets Uttar Pradesh CM Yogi Adityanath at his residence in Lucknow pic.twitter.com/KOWEyBxHVO
— ANI (@ANI) August 19, 2023