Attack: సోదాల కోసం వెళ్తున్న ‘ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)’ బృందంపై దుండగులు దాడికి పాల్పడ్డారు. రాళ్లతో కొట్టి వారి కారు అద్దాలను ధ్వంసం చేశారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రం ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సందేశ్ఖళి ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా, ఈడీ బృందంపై దాడిని పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ తీవ్రంగా ఖండించారు. ఇది భయంకరమైన ఘటన అన్నారు. ఈ దాడి ఆందోళనకరమైనదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో అనాగరికతను, విధ్వంసాన్ని నిలువరించాల్సిన బాధ్యత నాగరిక ప్రభుత్వానిదేనని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తన కనీస విధుల నిర్వహణలో విఫలమైతే భారత రాజ్యాంగం తనపని తాను చేస్తుందని హెచ్చరించారు.
బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవడానికి తన దగ్గర అన్ని రకాల రాజ్యంగపరమైన అధికారాలు ఉన్నాయని గవర్నర్ తన అధికారాలను గుర్తుచేశారు. ఎన్నికల ముందు జరిగే ఇలాంటి హింసాత్మక ఘటనలకు ముగింపు పలుకాల్సిన అవసరం ఉందని, ఆ ముగింపునకు ఇదే నాంది కావాలని గవర్నర్ ఆనందబోస్ వ్యాఖ్యానించారు.
West Bengal Governor CV Ananda Bose says, “It is a ghastly incident. It is alarming and deplorable. It is the duty of a civilised government to stop barbarism and vandalism in a democracy. If a govt fails in its basic duty, then the Constitution of India will take its course. I… https://t.co/jK3VIXkXTI
— ANI (@ANI) January 5, 2024