న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని కూరగాయల మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆజాద్పూర్ కూరగాయల మార్కెట్లో ఇవాళ మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో కూరగాయలు అమ్మే వ్యాపారులు, కొనేందుకు వెళ్లిన కస్టమర్లు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బయటికి పరుగులు తీశారు.
చూస్తుండగానే మార్కెట్ అంతటా మంటలు వ్యాపించాయి. కూరగాయలు, ఇతర సామాగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బందిని రప్పించి ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పేశారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉందన్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమై ఉంటుందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. ప్రమాదంలో ఆస్తి నష్టమే తప్ప ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు.
#WATCH | A fire broke out in the Azadpur vegetable market of Delhi. No casualties have been reported. The fire has been brought under control, cooling process is underway. pic.twitter.com/viXr82GSY5
— ANI (@ANI) September 29, 2023