UttaraKhand | హరిద్వార్ వేదికగా జరిగిన ధర్మ సంసద్లో విద్వేష పూరిత ప్రసంగాలు చేసిన వ్యక్తుల అరెస్టులు ప్రారంభమయ్యాయి. ధర్మ సంసద్లో విద్వేష పూరిత ప్రసంగాలు చేశారంటూ వసీం రిజ్వి అలియాస్ జితేంద్ర త్యాగి త్యాగి, యతి నరసింహానందను ఉత్తరాఖండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముస్లింలపై విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశాయి. విపక్షాలన్నీ కూడా తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం విదితమే.
ధర్మ సంసద్ వేదికగా ముస్లింలపై జితేంద్ర నారాయణ్ త్యాగి విద్వేష పూరిత ప్రసంగం చేశారంటూ గుల్బర్ ఖాన్ అనే వ్యక్తి హరిద్వార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక.. యతి నరసింహానంద ఆధ్వర్యంలో డిసెంబర్ 17 నుంచి 19 వరకు హరిద్వార్లో ధర్మ సంసద్ జరిగింది. ఈ సందర్భంగానే ఓ వర్గంపై వీరు విద్వేష పూరిత ప్రసంగాలు చేశారు. మరోవైపు ధర్మ సంసద్లో వీరు చేసిన ప్రసంగాలకు గాను ఉత్తరాఖండ్ పోలీసులు జితేంద్ర త్యాగితో సహా పలువురిపై కేసులు కూడా నమోదు చేశారు. మరోవైపు ఈ విషయంలో సుప్రీం కోర్టు ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. హిందూ నేతలు ఇలాంటి ప్రసంగాలు చేయడాన్ని సుప్రీం ధర్మాసనం తప్పుబట్టింది.