భోపాల్: మధ్యప్రదేశ్కు చెందిన బీజేపీ నాయకుడు రాజకీయ దుమారం రేపారు. వ్యూహంలో భాగంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) తనను కాంగ్రెస్లోకి పంపిందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసిన ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత తిరిగి బీజేపీ గూటికి చేరుకున్నారు. బీజేపీ నాయకుడు రాంకిషోర్ శుక్లా (Ramkishore Shukla) అలియాస్ భయ్యాజీ ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ వ్యూహంలో భాగంగా ఆర్ఎస్ఎస్ తనను కాంగ్రెస్లోకి పంపిందని తెలిపారు. ‘అసెంబ్లీ ఎన్నికలకు ముందు నేను కాంగ్రెస్లోకి మారా. కాంగ్రెస్ టికెట్పై మోవ్లో పోటీ చేసి ఓడిపోయా. ఇదంతా ఎన్నికల వ్యూహంలో భాగంగా జరిగింది. గత ఏడాది అక్టోబర్లో ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత ఆదేశాల మేరకు నేను అలా చేశా’ అని మీడియాతో శుక్లా అన్నారు.
కాగా, తాను అలా చేయడానికి బీజేపీ అభ్యర్థిని ఉషా ఠాకూర్ బలహీన పరిస్థితి కారణమని శుక్లా తెలిపారు. ఆమెకు పార్టీ నుంచే పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అనంత్సింగ్ దర్బార్ స్వతంత్ర అభ్యర్థిగా అక్కడ పోటీ చేశారని అన్నారు. ఈ రాజకీయ సమీకరణల వల్ల తాను త్యాగానికి సిద్ధమైనట్లు తెలిపారు. ఆర్ఎస్ఎస్ నేత, వీహెచ్పీకి చెందిన ఇండోర్ విభాగం నేత అభిషేక్ ఉదేనియా తనను కాంగ్రెస్లోకి పంపారని శుక్లా వెల్లడించారు.