సద్గురు జగ్గీ వాసుదేవ్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: ఒకప్పుడు యుద్ధాలు గెలిచి హీరోలు అయ్యేవారని, ప్రస్తుతం యుద్ధాలను ఆపిన వారే హీరోలు అని సద్గురు జగ్గీ వాసుదేవ్ పేర్కొన్నారు. బుడాపెస్ట్లోని హీరో స్కేర్లో ఆయన మాట్లాడుతూ.. ‘సేవ్ సాయిల్’ క్యాంపెయిన్లో భాగంగా ఆయన చేపట్టిన బైక్ యాత్ర.. హంగేరి, సెర్బియా, బల్గేరియా, రొమేనియా మీదుగా బుధవారం టర్కీ చేరుకుంది.
నేల గురించి అందరూ మాట్లాడుకోవాలని, నేలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో తాను ఈ యాత్ర చేపట్టానని సద్గురు పేర్కొన్నారు. భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన నేలను అందించాలని పిలుపునిచ్చారు.