న్యూఢిల్లీ : గగన్యాన్ మిషన్లో భాగంగా మహిళా రోబో ‘వ్యోమ్ మిత్ర’ను అంతరిక్షంలోకి పంపబోతున్నామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. శనివారం న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ‘అక్టోబర్లో గగన్యాన్ ట్రయల్ మిషన్ ప్రయోగించనున్నాం. రెండో మిషన్ ద్వారా వ్యోమిత్రాను స్పేస్లోకి పంపుతాం’ అని చెప్పారు. వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లి.. సురక్షితంగా తీసుకురావటమన్నది చాలా ముఖ్యమైందని అన్నారు.