రాయ్పూర్: చత్తీస్ఘడ్(Chhattisgarh Assembly Elections) జిల్లాలోని నక్సల్ ప్రభావిత ప్రాంతమైన బస్తర్లో ఇవాళ ఓటింగ్ జరుగుతోంది. ఆ ప్రాంతంలో ఉన్న సుక్మా అసెంబ్లీ నియోజకవర్గంలో ఓట్లు వేసేందుకు పోలింగ్ బూత్ల వద్ద జనం బారులు తీరారు. సుక్మాలోని కరిగుండమ్ అనే ప్రాంతంలో దాదాపు 23 ఏళ్ల తర్వాత మళ్లీ ఓటింగ్ ప్రక్రియ జరుగుతోంది. సీఆర్పీఎఫ్ 150 బెటాలియన్, డిస్ట్రిక్ట్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఆ ప్రాంతాల్లో భద్రత కల్పించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి కవాసి లక్మ.. కొంటా అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటేశారు.
చత్తీస్ఘడ్లో మొత్తం 90 సీట్లు ఉన్నాయి. అయితే ఇవాళ తొలిదశలో భాగంగా 20 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. దాంట్లో మావో ప్రభావిత ప్రాంతమైన బస్తర్లోనే 12 సీట్లు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపు 60 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. తొలి దశకు చెందిన 20 స్థానాల్లో.. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 17 గెలువగా, రెండు సీట్లు మాత్రమే బీజేపీ గెలిచింది. చత్తీస్ఘడ్లోని రెండో దశ ఎన్నికలు నవంబర్ 17వ తేదీన జరగనున్నాయి. రెండో ఫేస్లో 70 స్థానాలకు ఓటింగ్ ఉంటుంది. డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు వెలుబడనున్నాయి.
#WATCH | Voters stand in a queue outside a polling booth in the Sukma Assembly Constituency to cast their votes for the Chhattisgarh Assembly elections 2023. pic.twitter.com/7OVHn0cCEl
— ANI (@ANI) November 7, 2023