న్యూఢిల్లీ: ఢిల్లీ మేయర్ ఎన్నిక(Delhi Mayor Polls) కోసం ఇవాళ ఓటింగ్ ప్రారంభమైంది. మేయర ఎన్నిక మూడుసార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి, హన్సరాజ్లు తొలుత ఓటేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల(supreme court order) మేరకు మేయర్ ఎన్నికను నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉదయం 11.30 నిమిషాలకు మున్సిపల్ హౌజ్లో మీటింగ్ ప్రారంభమైంది. మేయర్తో పాటు డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీలోని ఆరుగురు సభ్యుల ఎన్నిక కోసం ఓటింగ్ జరుగుతోంది.
ఎంపీల తర్వాత కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు ఓటు వేస్తున్నారు. ముందుగా లోక్సభ, రాజ్యసభ ఎంపీలు ఓటేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇద్దర్ని మేయర్ అభ్యర్ధులుగా ప్రకటించింది. షెల్లీ ఒబ్రాయ్, ఆశూ థాకూర్లు ఆప్ తరపున పోటీపడుతున్నారు. ఇక బీజేపీ తరపున షాలీమార్ భాగ్ పోటీలో ఉన్నారు.
నామినేటెడ్ సభ్యులు ఓటు వేయరాదు అని షెల్లీ ఒబ్రాయ్ సుప్రీంలో కేసు వేసిన విషయం తెలిసిందే. అయితే నామినేటెడ్ సభ్యులు ఓటు వేయరాదు అని సీజేఐ డీవై చంద్రచూడ్ తన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. రాజ్యాంగంలోనూ ఇదే ఉందన్నారు.
250 వార్డులు ఉన్న ఢిల్లీ మున్సిపాల్టీలో .. ఆమ్ ఆద్మీ పార్టీ 134 సీట్లు గెలిచింది.బీజేపీ 113 సీట్లు కైవసం చేసుకున్నది. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఢిల్లీ మున్సిపాల్టీలో బీజేపీ పట్టుకోల్పోయింది.