న్యూఢిల్లీ : నయా ఉత్తరప్రదేశ్ కోసం ఓట్లు వేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ యూపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఓట్లు వేయడమే ఓటర్లకు పెద్ద కర్తవ్యమని, ఎన్నికల్లో పాల్గొనాలని కోరారు. ఇవాళ ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. ఈ క్రమంలో ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు.
రాష్ట్రంలోని 11 జిల్లాల పరిధిలోని 58 అసెంబ్లీ స్థానాలకు గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. సాయంత్రం 6 గంటల వరకు సాగనున్నది. మధుర, ముజఫర్నగర్, మీరట్, ఘజియాబాద్, బులంద్షహర్, హాపూర్, షామ్లీ, బాగ్పత్, అలీఘర్, ఆగ్రా, గౌతమ్ బుద్ధనగర్ జిల్లాల పరిధిలో పోలింగ్ జరుగుతున్నది.
అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్లో 623 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. దాదాపు 2.27 కోట్ల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. 403 స్థానాలున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎనిమిది విడుతల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. తొలి విడుత ఎన్నికలు ఇవాళ ప్రారంభం కాగా.. చివరి దశ ఎన్నికలు మార్చి 7న జరుగనున్నాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరుగనున్నది.