ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులపై పుణె ట్రాఫిక్ పోలీసులు నిఘా పెట్టి.. చర్యలు తీసుకుంటున్నారు. ఓ ద్విచక్ర వాహనదారుడు తన బైక్ను నాన్ పార్కింగ్ జోన్లో పార్క్ చేసి వెళ్లిపోయాడు. అంతలోనే ట్రాఫిక్ పోలీసులు ఆ బైక్ను క్రేన్ సహాయంతో వాహనంలోకి ఎక్కించేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న వాహనదారుడు హుటాహుటిన అక్కడికి చేరుకుని బైక్పై కూర్చున్నాడు. అతను బైక్పై కూర్చున్నప్పటికీ.. ట్రాఫిక్ పోలీసులు అలానే ఆ బండిని పైకి లేపారు. ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
అయితే రాంగ్ పార్కింగ్ చేసినందుకు పోలీసులకు క్షమాపణ చెప్పి జరిమానా చెల్లించాడు సదరు ద్విచక్ర వాహనదారుడు. ఇక బైక్తో అతన్ని కూడా క్రేన్ సహాయంతో వ్యాన్లో ఎక్కించిన పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.