‘చదువది ఎంత చదివినా.. రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకమున్’.. అంటాడు మారద వెంకయ్య కవి. కేవలం చదువొక్కటే సరిపోదు.. సమాజంలో జరుగుతున్న వ్యవహారాలపై దృష్టి నిలపాలి. ఆపదలో వున్న వారిని ఆదుకోవాలన్న స్పృహ తట్టాలి. అప్పుడే చదువుకున్న చదువుకు సార్థకత. ఓ పాఠశాల పిల్లవాడు చేసిన ఓ మంచి పని ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సమాజం మొత్తం ఆ విద్యార్థిని తెగ మెచ్చుకుంటోంది. ఓ వృద్ధ దంపతులు రోడ్డుపై కూర్చుండిపోయారు.
వారి ముందున్న వాటర్ బాటిల్ ఖాళీగా ఉండిపోయింది. నీళ్లు తెచ్చుకునే స్థాయిలో కూడా వాళ్లు లేరు. ఈ విషయాన్ని పాఠశాలకు వెళ్తున్న ఓ విద్యార్థి గమనించాడు. వెంటనే తన టిఫిన్ బ్యాగులో ఉన్న వాటర్ బాటిల్ను తీసి, ఆ వృద్ధ దంపతుల వాటర్ బాటిల్లో పోసేశాడు. ఈ ఫొటోను అవినాశ్ శరన్ అనే ఐఏఎస్ అధికారి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ద్వేషాన్ని నేర్పిస్తారు.. దయ సహజంగానే పుట్టుకొస్తుంది అంటూ ట్యాగ్ లైన్ పెట్టారు. ఈ ఫొటోకు 22,000 లైకులు వచ్చాయి.
Hatred is Taught. Kindness is Natural.❤️ pic.twitter.com/plKNo1asLv
— Awanish Sharan (@AwanishSharan) April 14, 2022