న్యూఢిల్లీ: హైతీలో ఎమర్జెన్సీ(Haiti Emergency) ప్రకటించారు. ఆదివారం వేల సంఖ్యలో ఖైదీలు జైలు నుంచి పరారీ అయ్యారు. పోర్ట్ ఆవ్ ప్రిన్స్ జైలుపై సాయుధ దళం అటాక్ చేయడంతో.. దాంట్లో ఉన్న ఖైదీలు పారిపోయారు. దీంతో ప్రభుత్వం 72 గంటల పాటు ఎమర్జెన్సీ ప్రకటించింది. ఆ హింసలో కనీసం 12 మంది మరణించారు. ప్రభుత్వ వర్గాల ప్రకారం సుమారు నాలుగు వేల మంది ఖైదీలు పరారీ అయినట్లు తెలుస్తోంది.
ప్రధాని ఏరియల్ హెన్రీ రాజీనామా చేయాలని సాయుధ దళాలు డిమాండ్ చేస్తున్నాయి. పోర్ట్ ఆవ్ ప్రిన్స్లో 80 శాతం ఆ గ్యాంగ్ల ఆధీనంలోనే ఉంటుంది. 2020 నుంచి జరిగిన ముఠా హింస వల్ల వేల సంఖ్యలో మరణాలు సంభవించాయి. రాజధానితో పాటు సమీపంలోని క్రాక్స్ డీ బోకేలో ఉన్న రెండు జైళ్లపై సాయుధలు అటాక్ చేశారు.