ఇంఫాల్, ఆగస్టు 31: మణిపూర్లో హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో మిలిటెంట్ల మధ్య కాల్పులు జరిగాయి. కాగా, బుధవారం ఇరు మిలిటెంట్ వర్గాల మధ్య జరిగిన వేర్వేరు ఘటనల్లో గాయపడ్డ ఇద్దరు గురువారం మరణించినట్టు అధికారులు ప్రకటించారు. బాంబు దాడిలో గాయపడ్డ వ్యక్తిని గౌహతికి తరలిస్తుండగా మృతిచెందాడు. గాయపడ్డ మరో వ్యక్తి చుర్చాంద్పూర్ దవాఖానలో మరణించినట్టు వారు చెప్పారు. అలాగే గత 12 గంటల వ్యవధిలో బిష్ణుపూర్ జిల్లాలోని కొయిరెంటెక్ పర్వత ప్రాంతం, చుర్చాంద్పూర్ జిల్లాలోని చింగ్ఫీ, కౌసాబంగ్లలో ఉదయం రెండు వర్గాల మధ్య కాల్పులు జరిగినట్టు తెలిపారు.