NEET | చెన్నై, ఆగస్టు 19: నీట్ బిల్లు ఆమోదం అంశంపై రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవిని ప్రశ్నించిన ఓ విద్యార్థి తండ్రిపై బీజేపీ ఫిర్యాదు చేసింది. సాలెం స్టీల్ప్లాంట్ ఉద్యోగి కేఆర్ అమ్మసిప్పన్ బహిరంగంగా కేంద్ర ప్రభుత్వ పాలసీని విమర్శించారని, సెంట్రల్ సివిల్ సర్వీసెస్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ సాలెం స్టీల్ప్లాంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కు సాలెం(తూర్పు) జిల్లా బీజేపీ అధ్యక్షుడు పీ షణ్ముగనాథన్ ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు కాపీని సెయిల్ చైర్మన్కు కూడా పంపారు. నీట్ టాపర్లతో గవర్నర్ రవి ఇటీవల నిర్వహించిన సమావేశంలో నీట్ నుంచి తమిళనాడును మినహాయించాలని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు ఎప్పుడు ఆమోదం తెలుపుతారని అమ్మసిప్పన్ గవర్నర్ను ప్రశ్నించారు.