Shirdi Temple | బంద్పై షిర్డీ గ్రామస్తులు వెనక్కి తగ్గారు. ఆలయానికి సీఐఎస్ఎఫ్ భద్రత కల్పించడానికి వ్యతిరేకంగా మే ఒకటో తేదీ నుంచి బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. రెవెన్యూశాఖ మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్ గ్రామస్తులతో సమావేశం అయ్యారు. అనంతరం ఈ విషయాన్ని ప్రకటించారు. ఉగ్రవాదుల నుంచి ఉన్న ముప్పు నేపథ్యంలో షిర్డీ సాయిబాబా ఆలయానికి భద్రత పెంచారు. ప్రస్తుతం సాయిబాబా ఆలయ భద్రత ఏర్పాట్లను సాయి సంస్థాన్ ట్రస్ట్ నిర్వహిస్తున్నది.
ఆలయ ప్రాంగణంలో భద్రతను మహారాష్ట్ర పోలీసులు చూస్తున్నారు. దాంతో నిత్యం ఆలయాన్ని బాంబ్ స్క్వాడ్ తనిఖీ చేస్తూ వస్తున్నది. ఈలోనే సీఐఎస్ఎఫ్ భద్రత కల్పించాలనే చర్చ మొదలైంది. సామాజిక కార్యకర్త సంజయ్ కాలే 2018లో బాంబే హైకోర్టులోని ఔరంగాబాద్ బెంచ్లో ఈ విషయంపై పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు సాయి సంస్థాన్ ట్రస్ట్ అభిప్రాయాన్ని కోరింది. ట్రస్టు సీఐఎస్ఎఫ్ భద్రతకు మద్దతు ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని షిర్డీ వాసులు వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించారు. ఫీజుల కోసం నిధుల సేకరణకు ఇటీవల భిక్షాటన సైతం నిర్వహించారు. ఆ తర్వాత అఖిలపక్షం నేతలు, గ్రామస్తులు సమావేశమై మే ఒకటి నుంచి సమ్మె చేసేందుకు నిర్ణయించి పలు డిమాండ్లు ప్రకటించారు.
ఆలయానికి సీఐఎస్ఎఫ్ భద్రత వద్దని, ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టు రద్దు చేయాలని, ప్రభుత్వ డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్, ప్రాంతీయ అధికారితో కమిటీ వేయాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది. ప్రస్తుతం ఉన్న తాత్కాలిక కమిటీ సాయిబాబా సంస్థాన్ను పరిశీలిస్తుండగా.. కార్యకలాపాలు నెమ్మదించాయి. చాలా పనులపై తీసుకోవాల్సిన నిర్ణయాలు పెండింగ్లో ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే పూర్తి స్థాయి కమిటీని నియమించాలని కోరడంతో పాటు ట్రస్ట్ బోర్డును వీలైనంత త్వరగా నియమించాలని, ఇందులో 50 శాతం ధర్మకర్తలు షిర్డీ నుంచే ఉండాలని డిమాండ్ చేశారు.