జమ్మూ కశ్మీర్ మహారాజ కుటుంబానికి చెందిన విక్రమాదిత్య సింగ్ కాంగ్రెస్కు రాజీనామా చేశారు. క్షేత్ర స్థాయిలో ఉన్న వాస్తవాలను అధిష్ఠానం ఏమాత్రం అధ్యయనం చేయడంలేదని విమర్శించారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపారు. ప్రస్తుతం ఈయన జమ్మూ కశ్మీర్లో ఎమ్మెల్సీ గా వున్నారు. కీలక సమస్యలు, కీలక అంశాలపై తన భావాలు ఏమాత్రం కాంగ్రెస్తో ఏకీభవించడం లేదన్నారు. జమ్మూ కశ్మీర్ ప్రజల మనోభావాలను కాంగ్రెస్ గాలికొదిలేసిందన్నారు.
‘కాంగ్రెస్కు నేను రాజీనామా చేస్తున్నాను. కీలక విషయాల్లో నా ఆలోచనలకు, కాంగ్రెస్ విధానాలకు కుదరడం లేదు. క్షేత్ర స్థాయిలోని వాస్తవాలు కాంగ్రెస్కు తెలియడం లేదు. జమ్మూ కశ్మీర్ ప్రజల మనోభావాలను కాంగ్రెస్ పట్టించుకోలేదు’ అంటూ విక్రమాదిత్య సింగ్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
విక్రమాదిత్య సింగ్ కాంగ్రెస్ అగ్రనేత, మాజీ రాయబారి కరణ్ సింగ్ కుమారుడు. కశ్మీర్ మహారాజా హరిసింగ్ మనుమడు. ఈయన గతంలో మెహబూబా ముఫ్తీ పార్టీలో ఉన్నారు. 2019లో ఈయన కాంగ్రెస్లో చేరారు.