హైదరాబాద్ : తమిళనాడులో ఎవరు ఊహించిన రీతిలో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన టీవీకే చీఫ్ విజయ్(TVK Chief Vijay) త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాడు. టీవీకే మొత్తం 234 స్థానాల్లో 107 సీట్లను గెలుచుకొని విజయ ఢంకా మోగించింది. ఈ నేపథ్యంలో విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. గవర్నర్కు రాజేంద్ర విశ్వనాథన్ అర్లేకర్కు లేఖ కూడా రాశారు. 108 స్థానాలతో టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవతరించినట్లు చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.
కాగా, విజయ్ ఎన్నికల్లో పెరంబూర్, తిరుచ్చి (తూర్పు) అనే రెండు చోట్ల నుంచి పోటీ చేసి గెలుపొందారు. చట్ట ప్రకారం ఒక వ్యక్తి ఒకేసారి రెండు స్థానాల్లో ఎమ్మెల్యేగా ఉండకూడదు, అందుకే ఒక సీటుకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో తిరుచ్చి ఈస్ట్కు రాజీనామా చేసి పెరంబూర్ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగనున్నట్లు సమాచారం. దీంతో త్వరలోనే ఆ స్థానానికి ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది.