తమళనాడు : టీవీకే చీఫ్, ప్రముఖ సినీ నటుడు జోసెఫ్ విజయ్తో(Vijay )చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియానికి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో విజయ్తో పాటు 9తొమ్మింది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం 10 గంటలకు జరగనున్న ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వంటి పలువురు ప్రముఖ నాయకులు హాజరు కానున్నారు.
కాగా, టీవీకే అధినేత విజయ్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు వీసీకే, ఐయూఎంఎల్ మద్దతు తెలియచేస్తూ లేఖలు అందచేయడంతో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న సందిగ్ధత తొలగిపోయింది. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమిళగ వెట్రి కళగం(టీవీకే) శాసనసభా పక్ష నేత విజయ్కు రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ శనివారం ఆమోదం తెలిపారు.
వివిధ పార్టీల నుంచి పొందిన సంతకాలతో కూడిన మద్దతు లేఖలను విజయ్ గవర్నర్కు సమర్పించడంతో ఐదు రోజులుగా సాగుతున్న హైడ్రామాకు ఎండ్ కార్డ్ పడింది. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీవీకే అధినేతకు విడుతలై చిరుతైగళ్ కట్చి(వీసీకే), సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు బేషరతు మద్దతు ప్రకటించిన అనంతరం విజయ్ టీవీకే సీనియర్ నాయకులతో కలసి 120 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలను గవర్నర్కు సమర్పించిన విషయం తెలిసిందే.