24గంటల్లో రెండు ప్రమాదాలు
బుధవారం రాత్రి బైక్తో పాటు పడిన ముగ్గురు యువకులు
ఒకరి మృతి.. ఇద్దరికి గాయాలు
తెల్లవారేదాకా బిక్కుబిక్కు
గురువారం రాత్రి కల్వర్టు కింద పడ్డ కారు
ఐదుగురికి గాయాలు
బుధరావుపేట శివారు జాతీయ రహదారిపై ప్రమాదకరంగా పనులు
కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని మృతుడి బంధువుల రాస్తారోకో
ఖానాపురం, జూలై 1: జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. మరో ఏడుగురిని గాయాలపాలుజేసింది. 24గంటల్లోనే ఒకే ప్రాంతంలో రెండు ప్రమాదాలు జరుగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట శివారు జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న కల్వర్టు ప్రమాదకరంగా మారి రెండు ఘటనలకు కారణమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబుబాబాద్ పట్టణం పత్తిపాకకు చెందిన ఏల్పుగొండ సాయిరాం (22) హమాలీ పనులు చేస్తుంటాడు. బంధువు అంత్యక్రియల కోసం ఇద్దరు మిత్రులు శరత్, సుమన్తో కలసి బైక్పై వరంగల్ వెళ్లారు. తిరిగి ఖానాపురం మీదుగా మహబుబాబాద్కు రాత్రి 7గంటల సమయంలో వెళ్తుండగా రాత్రి బుధరావుపేట శివారులోకి రాగానే నిర్మాణంలో ఉన్న కల్వర్టు వద్ద ఎలాంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు లేకపోడంతో దానిని ఢీకొని పక్కనే ఉన్న నీటిగుంతలో పడిపోయారు. ఈ ఘటనలో సాయిరాం నీటిలో మునిగి అక్కడికక్కడే చనిపోయాడు. శరత్, సుమన్కు గాయాలై స్పృహ తప్పి రాత్రంతా అక్కడే పడిపోయారు. గురువారం ఉదయం స్థానికులు గుర్తించి 108లో నర్సంపేట వైద్యశాలకు తరలించారు. పోలీసులు చేరుకుని సాయిరాం మృతదేహాన్ని వెలికితీశారు. ఘ టనా స్థలంలో కుటుంబసభ్యులు బోరున విలపించారు. రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే తమ కుటుంబం పెద్దదిక్కును కోల్పోయిందని సాయిరాం కుటుంబసభ్యులు, గ్రామస్తులు అక్కడే గంటపాటు రాస్తారోకో చేశారు. దుగ్గొండి రూరల్ సీఐ సతీష్బాబు వారితో మాట్లాడి విరమింపజేశారు. మృతుడి సోదరుడు సందీప్ ఇచ్చిన ఫిర్యా దు మేరకు కాంట్రాక్టర్లు ఎం.శ్రీనివాసరావు, సందీప్రావుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సాయిబాబు తెలిపారు.
కల్వర్టులో పడిన కారు
ఇదే కల్వర్టును ఢీకొని గురువారం రాత్రి ఓ కారు గుంతలో బోల్తాపడింది. ఈ ఘటనలో ఐదుగురు యువకులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ..వరంగల్ పట్టణానికి చెందిన సాయికృష్ణ, హరి, వెంకటేశ్, పొనిత్సింగ్, వినయ్ కలిసి మహబూబాబాద్ జిల్లా పరిధిలోని భీమునిపాదం వద్దకు కారులో వెళ్లి తిరిగివస్తున్నారు. ఈ క్రమంలో బుధరావుపేట శివారులోకి రాగానే కారు కల్వర్టులోకి దూసుకెళ్లి బోల్తాపడింది. పెద్ద శబ్దం రావడంతో స్థానికులు గమనించి ఘటనా స్థలానికి పరుగుపరుగున వచ్చారు. కారులో ఇరుక్కున్న ఐదుగురిని బయటకు తీసి వెంటనే అంబులెన్స్లో నర్సంపేట వైద్యశాలకు తరలిచారు. 24 గంటల వ్యవధిలోనే ఈ కల్వర్టు వద్ద రెండు ప్రమాదాలు జరగడంతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా కల్వర్టు ప్రదేశం వద్ద ఇరువైపులా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం
బుధరావుపేట శివారు నుంచి కంబాలపల్లి వరకు 33 కిలోమీటర్ల మేర 365 జాతీయ రహదారి పనులు చేస్తున్నారు. ఇందులో భాగంగా కడుతున్న కల్వర్టును సకాలంలో పూర్తి చేయకపోవడం, పని ప్రదేశంలో సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. గతంలో మహబూబాబాద్కు చెందిన ఓ వ్యక్తి మంగళవారిపేట శివారులో రోడ్డు చదును చేసే యంత్రం ఢీ కొని చనిపోయాడు. నెల క్రితం కొత్తగూడ మండలం సాయిరెడ్డిపల్లికి చెందిన కారు ఇదే కల్వర్టులో పడింది.