ముంబై: వీడియోకాన్ లోన్ ఫ్రాడ్ కేసులో అరెస్టయిన ముగ్గురు నిందితులను సీబీఐ అధికారులు ఇవాళ మధ్యాహ్నం ముంబైలోని సీబీఐ స్పెషల్ కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసులో ఐసీఐసీఐ బ్యాంకు మాజీ ఎండీ, సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ ఛైర్మన్ వేణుగోపాల్ ధూత్ నిందితులుగా ఉన్నారు. చందాకొచ్చర్ సీఈవోగా ఉన్నప్పుడు ఐసీఐసీఐ బ్యాంకు నుంచి వీడియోకాన్ కంపెనీ రూ.3200 కోట్లకుపైగా లోన్ తీసుకున్నది.
ఈ లోన్ మంజూరు సమయంలో చందాకొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. దాంతో ఇటీవల చందాకొచ్చర్ను, ఆమె భర్త దీపక్ కొచ్చర్ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఇవాళ రుణగ్రహీత అయిన వేణుగోపాల్ ధూత్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ముగ్గురిని కలిపి ముంబైలోని సీబీఐ కోర్టుకు తీసుకొచ్చారు.