కట్ని: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కట్నీ జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని కస్తూర్బా గాంధీ హాస్టల్కు చెందిన విద్యార్థినుల చేత హాస్టల్ సిబ్బంది చపాతీలు చేయించారు. ఈ ఘటనను ఎవరో రహస్యంగా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్గా మారింది. ఆ వీడియోలో స్కూల్ యూనిఫాంలో ఉన్న ఓ విద్యార్థిని పిండి పిసికి చపాతీలు తాలుస్తుండగా.. మరో విద్యార్థిని కాలుస్తూ కనిపించింది.
వైరల్గా మారిన ఈ వీడియోపై విమర్శలు వెల్లువెత్తడంతో సంబంధింత అధికారులు అప్రమత్తమయ్యారు. వీడియోను డిలీట్ చేయించి, ఘటనపై విచారణకు ఆదేశించారు. విద్యార్థినులు హాస్టల్లో ఉంటున్నది పని చేయడానికి కాదని, చదువుకోవడానికి వచ్చారని, ఈ ఘటనపై తాము విచారణ చేస్తున్నామని స్థానిక డీఈవో చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.