Fire @ Delhi Rail Godown | నార్త్ ఢిల్లీలో ఆదివారం సాయంత్రం దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రతాప్నగర్ మెట్రో స్టేషన్కు సమీపంలోని సబ్జీ మండీ వద్ద గల రైల్వే గోడౌన్లో అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలోనే ఉందని చెప్పారు. ఆదివారం సాయంత్రం 4.25 గంటలకు సబ్జీ మండిలోని రైల్వే గోడౌన్లో అగ్ని ప్రమాదం సంభవించిందని సమాచారం వచ్చిందని ఢిల్లీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ చెప్పారు.
ఈ సమాచారం తెలిసిన వెంటనే 14 ఫైరింజన్లు ఘటనా స్థలానికి తరలించామని అతుల్ గార్గ్ తెలిపారు. ప్రమాదానికి కారణాలు తెలియ రాలేదన్నారు. తొలుత రెండు ఫైరింజన్లు పంపించారు. అటుపై ఏడు.. తర్వాత మరో ఏడుగు ఫైరింజన్లు పంపించినట్లు అగ్ని మాపక దళ అధికారులు తెలిపారు. మొత్తం 16 ఫైరింజన్లు మంటలు ఆర్పివేశాయి.
భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో నల్లని మబ్బులు ఈ ప్రాంతాన్ని కమ్మేశాయి. ప్రమాద కారణాలు తెలియకున్నా.. భారీ నష్టం వాటిల్లి ఉంటుందని అధికారులు చెప్పారు.