న్యూఢిల్లీ : గాయని లతా మంగేష్కర్ మృతిపట్ల ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ప్రగాఢ సంతాపం తెలిపారు. భారతీయ సినిమా నైటింగేల్, లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ మరణం తీవ్ర విచారానికి గురి చేసిందన్నారు. మధురమైన, శ్రావ్యమైన, గంభీరమైన గళంతో అనేక దశాబ్దాలపాటు భారత దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రేమికులను సమ్మోహనపరచిన లతా మంగేష్కర్ మరణంతో భారతదేశం తన గళాన్ని కోల్పోయిందన్నారు.