చెన్నై, మార్చి 24: గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కూతురు, న్యాయవాది వింధ్య రాణి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తమిళనాడులోని కృష్ణగిరి నియోజకవర్గం నుంచి నామ్ తమిగర్ కట్చి(ఎన్టీకే) పార్టీ తరపున ఆమె బరిలోకి దిగుతున్నారు.
గతంలో బీజేపీ తమిళనాడు రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షురాలిగా ఉన్న ఆమె ఇటీవలే ఎన్టీకేలో చేరారు. ఆమె ఎన్నికల్లో పోటీ చేసే విషయాన్ని ఎన్టీకే అధ్యక్షుడు సీమన్ ఇటీవల చెన్నైలో జరిగిన బహిరంగ సభలో ప్రకటించారు. ఎన్టీకే తరపున లోక్సభకు పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో సగం మంది మహిళలే కావడం గమనార్హం.