ముంబై : ముంబైకి చెందిన చెస్ ప్లేయర్ వేదాంత్ పనేసర్ ఫిడే మాస్టర్ (ఎఫ్ఎం) టైటిల్ గెలుచుకున్నాడు. విలేపార్లేలోని ఎన్ఎం కాలేజీ విద్యార్ధి అయిన వేదాంత్, 17జాతీయ చెస్ చాంపియన్షిప్లతో పాటు, కామన్వెల్త్ గేమ్స్ లో కాంస్య పతకమూ గెలుచుకున్నాడు.ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ ఇచెక్స్ (ఫిడే) ఈ ప్రతిష్టాత్మకమైన ఫిడే మాస్టర్ (ఎఫ్ఎం) టైటిల్ను ప్రకటించింది. గ్రాండ్ మాస్టర్ (జీఎం)ఇంటర్నేషనల్ మాస్టర్ (ఐఎం) టైటిల్స్ తరువాత అత్యంత ప్రతిష్టాత్మకమైన గుర్తింపు ఇది. ఈ గుర్తింపు పొందడానికి ఆటలో స్థిరత్వం చూపుతూ అంతర్జాతీయ పోటీలలో 2300 లేదా అంతకు మించిన ఫిడే రేటింగ్ పొందాల్సి ఉంటుంది.
ఎన్ఎం కాలేజీ విద్యార్ధిని అయిన వేదాంత్, చెస్ చాంఫియన్గా 2380 ఫిడే రేటింగ్ పొందాడు. ఈ రేటింగ్ పొందడానికి ఎన్ఎం కాలేజీ కార్యాచరణ ఎంతగానో తోడ్పడింది. వేదాంత్ లాంటి ప్రతిభావంతులను గుర్తించి, తగిన శిక్షణ అందించడంలో ఎన్ఎం కాలేజీ అత్యంత కీలక పాత్రపోషిస్తుంది. వేదాంత్ ఇప్పుడు ఇంటర్నేషనల్ మాస్టర్(ఐఎం) టైటిల్కు ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. కరోనా సమయంలో అతనితో పాటుగా అతని బృందం చెస్ ద్వారా లభించిన డబ్బును పీఎం కేర్స్ ఫండ్కు అందించాడు.