ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో భారతదేశ త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్తో సహా 13 మంది మృతి చెందారు. ఈ దుర్ఝటన బుధవారం జరిగింది. అయితే హెలికాప్టర్లో ప్రయణించే సైనిక అధికారులలో ఒక్క వ్యక్తి మాత్రం సజీవంగా ఉన్నాడు. ఆయనే ఐఎఎఫ్ అధికారి గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్.
హెలికాప్టర్ కుప్పకూలిన ప్రమాదంలో వరుణ్ సింగ్కు తీవ్రగాయాలు కావడంతో ఆయన ప్రస్తుతం వెల్లింగ్టన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కెప్టెన్ వరుణ్ సింగ్ గత ఆగస్టులోనే భారత ప్రభుత్వం నుంచి శౌర్యచక్ర అవార్డు అందుకున్నారు. ఆయన ఆర్మీలో అందించిన విశేష సేవలకుగాను ఈ పురస్కారం అందుకున్నారు.
గతంలోనూ ప్రమాదం నుంచి బయటపడ్డాడు
వరుణ్ సింగ్ గత సంవత్సరం తాను నడుపుతున్న యుద్ధ విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తినప్పటికీ.. ధైర్య సాహసాలు, నైపుణ్యాన్ని ప్రదర్శించి ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా ల్యాండ్ చేశారు.
వరుణ్ సింగ్ ప్రస్తుతం ప్రమాదం జరిగిన సూలూర్ ఎయిర్ బేస్లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో డైరెక్టింగ్ స్టాఫ్గా పనిచేస్తున్నారు. బుధవారం సిడిఎస్ బిపిన్ రావత్ ఇదే కాలేజీలో ఒక లెక్చర్ ఇవ్వడానికి హెలికాప్టర్లో వెళుతుండగా.. ప్రమాదంలో మరణించారు.
వరుణ్ సింగ్ ఉతర్త్ ప్రదేశ్ రాష్ట్రంలోని ధనోలి గ్రామానికి చెందినవారు. ఆయన ప్రాణాలతో ఉన్నారని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిసిన గ్రామస్తులు.. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.