ముంబై : వందే భారత్ ఎక్స్ప్రెస్కు మరో ప్రమాదం ఎదురైంది. ముంబై సెంట్రల్ నుంచి గాంధీనగర్ వెళుతున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ శనివారం ఉదయం 8.17 గంటలకు అతుల్ సమీపంలో పశువును ఢీకొంది. ట్రాక్పై పశువు ఢీకొనడంతో వందే భారత్ ఎక్స్ప్రెస్ ముందు భాగంలో డ్రైవర్ కోచ్ స్వల్పంగా దెబ్బతిందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనతో ట్రైన్ 15 నిమిషాల పాటు నిలిచిపోయింది.
ముంబై సెంట్రల్ డివిజన్లో అతుల్ ప్రాంతంలో వందేభారత్ ట్రైన్ను పశువు ఢీకొనడంతో రైలును 15 నిమిషాల పాటు నిలిపివేశారని రైల్వేలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. ఫ్రంట్ కోచ్ స్వల్పంగా దెబ్బతినడం మినహా రైలుకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని తెలిపింది.
కాగా గడిచిన కొద్దివారాల్లో వందే భారత్ ట్రైన్లో ఇలాంటి ఘటన జరగడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. న్యూఢిల్లీ-వారణాసి రూట్లో ఇటీవల వందే భారత్ ట్రైన్ ట్రాక్షన్ మోటార్లో సాంకేతిక సమస్యలు ఎదురవగా అంతకుముందు ముంబై-గాంధీనగర్ రూట్లో ట్రైన్ను పశువులు ఢీకొన్న ఘటనలు వరసగా రెండు రోజుల పాటు జరిగాయి.