అహ్మదాబాద్: వందే భారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express)లో ప్రయాణికుల టిక్కెట్లు తనిఖీ చేసే టీసీ (ticket checker) ఆ రైలు కింద పడే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. రైల్వే స్టేషన్లోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ సంఘటన జరిగింది. ముంబై వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు అహ్మదాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరేందుకు సిద్ధమైంది. అయితే ఆ స్టేషన్లోని ఫ్లాట్ఫామ్పై ఆ రైలు టీసీ నిల్చొని ఉన్నారు. ఇంతలో ఉన్నట్టుండి వందే భారత్ ఎక్స్ప్రెస్ కంపార్ట్మెంట్ డోర్లు మూసుకుపోయాయి. ఆ వెంటనే స్టేషన్ నుంచి ఆ రైలు కదిలింది.
కాగా, ఫ్లాట్ఫామ్పై ఉన్న టీసీ దీనిని గమనించి తేరుకున్నాడు. కంపార్ట్మెంట్ల డోర్లు మూసుకుపోవడంతో చివరన ఉన్న లోకోపైలట్ క్యాబిన్ వద్దకు పరుగెత్తాడు. డోర్ తెరువాలంటూ లోకోపైలట్ను కోరాడు. అంతేగాక రైలు కదులుతుండగా పాక్షికంగా తెరిచి ఉన్న లోకోపైలట్ ఉన్న క్యాబిన్లోకి ఎక్కేందుకు ప్రయత్నించాడు. అయితే పట్టుతప్పి ఆ రైలు కింద పడబోయాడు. ఫ్లాట్ఫామ్పై ఉన్న ప్రయాణికులు వెంటనే స్పందించి ఆ టీసీని కాపాడారు. ఈ నెల 26న అహ్మదాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Video | Gates of Mumbai bound Vande Bharat closed at Ahmedabad station & a Ticket checker was left out. Desparate to get in, he attempted something that may have cost him his life. This is reported to have happened on 26th June. #Vandebharat #Mumbai #IndianRail pic.twitter.com/WvzuQDGudN
— ABS (@iShekhab) June 29, 2023