అయోధ్య: మేకలపై నుంచి వెళ్లిందన్న కోపంతో కొందరు వ్యక్తులు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో రెండు బోగీల అద్దాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆయోధ్య పట్టణం సమీపంలో రౌనాహి పోలీస్స్టేషన్ పరిధిలోని సోహవాల్ ఏరియాలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకున్నది.
రైలు సిబ్బంది ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు.. నన్హు పాశ్వాన్, అతని కుమారులు అజయ్, విజయ్గా గుర్తించారు. ఆదివారం అదే ప్రాంతంలో వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు కింద పడి నన్హు పాశ్వాన్కు చెందిన 6 మేకలు చనిపోయాయి.
దాంతో కక్ష పెంచుకున్న నన్హు పాశ్వాన్ మంగళవారం ఉదయం 9 గంటలకు తన ఇద్దరు కుమారులతో కలిసి కాపుగాసి రైలు రాగానే రాళ్లు విసిరారు. ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు రైలు లక్నోకు పరుగులు పెడుతుండగానే నిందితులను గుర్తించి అందుపులోకి తీసుకున్నారు.