కడ్తాల్, ఏప్రిల్ 27 : అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార కేంద్ర ఆవరణలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీసీసీబీ డైరెక్టర్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్గుప్తా, జడ్పీటీసీ దశరథ్నాయక్, వైస్ ఎంపీపీ ఆనంద్, ఎంపీటీసీ శ్రీనివాస్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు సీఎం కేసీఆర్ రూ.20 వేల కోట్లు కేటాయించారని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్లు భారతమ్మ, ఎంపీటీసీలు లచ్చిరాంనాయక్, గోపాల్, శ్రీనివాస్రెడ్డి, ఉప సర్పంచ్ రామకృష్ణ, ప్యాక్స్ వైస్ చైర్మన్ సత్యం, పీఏసీఎస్ డైరెక్టర్లు వీరయ్య, వెంకటేశ్, సేవ్యానాయక్, వెంకట్యాదవ్, నాయకులు జహంగీర్అలీ, నరేందర్రెడ్డి, అశోక్, భిక్షపతి, మల్లయ్య, రాంచంద్నాయక్, ఇర్షాద్, అంజి, నర్సింహాగౌడ్, నరేశ్, లింగం, సాయికుమార్, వ్యవసాయశాఖ ఏవో శ్రీలత, రైతులు, నాయకులు పాల్గొన్నారు.
ప్రజా ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని రావిచేడ్, పెద్దారెడ్డిచెరువు తండా, మైసిగండి, ఏక్వాయిపల్లి గ్రామాలకు చెందిన సత్యమ్మకు రూ.24 వేలు, సుశీలకు రూ.16వేలు, బాల్రాజ్కు రూ. 22వేలు, కోట్యానాయక్కు రూ.19,500 ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను మండల కేంద్రంలో జైపాల్యాదవ్ అందజేశారు.