న్యూఢిల్లీ, మే 6: దేశంలో కరోనా వ్యాప్తి, వైద్య వ్యవస్థ పనితీరుపై ప్రధాని మోదీ కేంద్రమంత్రులు, రాష్ర్టాల ఉన్నతాధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు 17.7 కోట్ల మందికి టీకాలు వేసినట్టు అధికారులు ఈ సందర్భంగా మోదీకి తెలిపారు. దీనిపై మోదీ స్పందిస్తూ.. వ్యాక్సినేషన్ వేగం తగ్గకుండా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు.