న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఓ వ్యాక్సినేషన్ సెంటర్లో విధులు నిర్వర్తిస్తున్న టీకా డ్రైవ్ పర్యవేక్షణ అధికారికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ క్రమంలో అతన్ని క్వారంటైన్ సెంటర్కు తరలించారు. ఈ వ్యాక్సినేషన్ సెంటర్లో రోజుకు 500 మందికి టీకా ఇచ్చారు. ఢిల్లీలో ఇప్పటి వరకు 13 లక్షల మందికి కరోనా టీకా తొలి డోసు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,506 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 20 మంది చనిపోయారు. 3,363 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఢిల్లీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,90,568కి చేరగా, మరణాల సంఖ్య 11,133కు చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 19,455.